Friday, October 8, 2010

ముగ్గురు జోగులు

ఆ ముగ్గురే.....

జోగీ జోగీ రాసుకుంటే?......బూడిద రాలుతుందంటారు. ఇక్కడలా కాదు......స్కాములు రాలాయిట!

మొన్నోరోజు "పొన్నాల లక్ష్మయ్య అసమర్థ మంత్రి. అందుకే నీళ్లన్నీ సముద్రం పాలయిపోతున్నాయి" అన్నాడట రఘువీరా. 

"నువ్వు మాత్రం తక్కువా? గోదాముల్లో  ఎరువులున్నా, రైతులకి ఎదురుచూపులు తప్పడం లేదు!" అన్నాట్ట పొన్నాల.

ప్రక్కనే వున్న జూపల్లి ని "నువ్వు మహబూబ్ నగర్ జిల్లాకే మంత్రివా? రాష్ట్రానికి కూడానా?" అనడిగాడట రఘువీరా.

జూపల్లి, "నువ్వు అనంతపురానికే అమాత్యునివా? లేక రాష్ట్రానికా?" అనడిగాడట.

పొన్నాల నవ్వుతూ "దొందూ దొందే"! మంచోళ్లే దొరికారు--అన్నాడట. (దొందూ దొందే కథ గుర్తుందా?)

అవండీ మన మంత్రుల (స్కాము)జోకులు! 

No comments: