Saturday, December 5, 2009

కామెడీ అనే....


నిజమైన హాస్యం
తెలుగు సినిమాల్లో ‘కామెడీ’ విషయానికొస్తే, విజయా వాహినీలే మొదట చెప్పుకోవాలి. శ్రీ హెచ్ ఎం రెడ్డిగారు, కే వీ రెడ్డిగారు మంచి హాస్య ప్రియులు!

చక్రపాణి సినిమాలో ‘డాక్టరు గారింట్లో నెయ్యికేమి కొదువ! అందులోనూ పశువుల డాక్టరు గారింట్లో!’ లాంటి సంభాషణలు మచ్చు తునకలు.

ఇక మిస్సమ్మ విషయానికొస్తే, స్వయంగా ఏ ఎన్ ఆర్ తనకి ఆ (డిటెక్టివ్) పాత్ర ఇమ్మని అడిగానని ప్రకటించారు—అది ఆ సినిమాకి ఆయువుపట్టులాంటి పాత్ర!

నటుల్లో అంజిగాడి దగ్గర్నుంచి, రేలంగి, రమణా రెడ్డి, పద్మనాభం, అల్లు రామలింగయ్య—ఇంకా రాజ బాబు, కేవీ చలం, చలం—తమదైన బాణీల్లో హాస్యం ఒలికించారు!

మన జంధ్యాల ప్రత్యేకం గా తెలుగు లో ‘హాస్య ప్రధానమైన’ సినిమాలకి ఒరవడి చుట్టారు.

‘గుడ్డు తండ్రి గాండ్రిస్తున్నాడు’; ‘తవికలు ‘; ‘నా ఆశ్వాన్ని తిసుకురండి’; ‘నా కొడుకూ కూతురూ రెండు పుర్రెలూ, యెముకలూ తీసుకెళ్ళి……………’ లాంటి సంభాషణలతో చెరగని తమ ముద్ర వేశారు కదా!

ఇలాంటి చమక్కుల వెనక ఓ రహస్యం వుందట!

అదేమిటో మరోసారి!

No comments: